13 July, 2026 | 6:27 PM

మహిళ గొంతు కోసి.. నిప్పంటించిన దుండగులు

08-05-2025 11:13 AM

హైదరాబాద్: చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్(Chandrayangutta Police Station) పరిధిలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దూరిన గుర్తుతెలియని వ్యక్తులు 55 ఏళ్ల మహిళను హత్య చేశారు. కూలీగా పనిచేసే ఆ మహిళ చంద్రాయణగుట్టలోని ఇందిరా నగర్‌లోని ఒక ఇంట్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. అర్ధరాత్రి సమయంలో స్థానికులు ఆ మహిళ గదిలో మంటలు చెలరేగుతున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కత్తితో గొంతు కోసి గాయపడిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మహిళను చంపిన తర్వాత దుండగులు నేరాన్ని దాచడానికి మృతదేహానికి నిప్పంటించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్థానికుల సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.