15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహిళ గొంతు కోసి.. నిప్పంటించిన దుండగులు

08-05-2025 11:13 AM

హైదరాబాద్: చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్(Chandrayangutta Police Station) పరిధిలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దూరిన గుర్తుతెలియని వ్యక్తులు 55 ఏళ్ల మహిళను హత్య చేశారు. కూలీగా పనిచేసే ఆ మహిళ చంద్రాయణగుట్టలోని ఇందిరా నగర్‌లోని ఒక ఇంట్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. అర్ధరాత్రి సమయంలో స్థానికులు ఆ మహిళ గదిలో మంటలు చెలరేగుతున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కత్తితో గొంతు కోసి గాయపడిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మహిళను చంపిన తర్వాత దుండగులు నేరాన్ని దాచడానికి మృతదేహానికి నిప్పంటించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్థానికుల సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.