calender_icon.png 8 October, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషాదం.. పిడుగు పడి బాలుడు మృతి

08-10-2025 07:12:05 PM

యాచారం: మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగు పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఏడవ తరగతి చదువుతున్న జోగు మనిష్(13) పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం అప్పుడే పాఠశాల వదలడంతో ఇంటికి వచ్చిన మనీష్ పిడుగుపాటుకు మృతి చెందాడు. దీంతో కుటుంబంలోనూ, గ్రామంలోను విషాద ఛాయలు అలుముకున్నాయి.