calender_icon.png 18 June, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం

18-06-2025 04:42:24 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు బుధవారం జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను మరింతగా విస్తరించాలని రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు అనుకూలమైన ప్రాంతమని, ఇప్పటికే హైదరాబాద్ లో డిఫెన్స్ కు సంబంధించిన వివిధ సంస్థలున్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ఎండీ, సీఈఓ డాక్టర్ జైతీర్థ్ ఆర్.జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్డీఎల్ జీఏ శ్రీనివాస మూర్తితో పాటు పలువురు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని రేవంత్ రెడ్డి ఆ ప్రతినిధి బృందానికి వివరిస్తూ, బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణ కోసం తెలంగాణ, హైదరాబాద్‌ను ఎంచుకోవాలని కోరారు. అందుకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది.