06-02-2026 01:39:12 AM
గడ్డపోతారంలో బీఆర్ఎస్ అభ్యర్థి జలగరి మల్లేష్ ముదిరాజ్
జిన్నారం/అమీన్పూర్, ఫిబ్రవరి5(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో మర వకుండా ఓటు వేసి గెలిపించాలని గడ్డపోతారం 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్య ర్థి జలగరి మల్లేష్ ముదిరాజ్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాను పోటీ చేస్తున్న11వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ మహిళలతో కలిసి గులాబీ కండువాలు కప్పుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఓటర్ల చేతిలో చేయి వేసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.
మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ అల్లుకుపోతున్నారు. పెద్దల ఆశీ ర్వాదం తీసుకుంటూ.. మరవకుండా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఇచ్చిన హామి లన్నీ అమలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్, భాస్కర్, రమేష్, దశరథ్, నరసింహ, చాకలి దశరథ్, కృష్ణ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.