మాజీ మంత్రి హరీష్రావును కలిసిన బీఆర్ఎస్ యువజన నాయకులు
07-04-2026 12:00 AM
రేగోడు, ఏప్రిల్ 6 : మాజీ మంత్రి హరీష్ రావును సోమవారం మర్యాదపూర్వకంగా రేగోడు మండల యువజన నాయకులు రాచోటి నిఖిల్ కలిశారు. ఈ సందర్భంగా రేగోడు మండల బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు నిఖిల్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బిక్షపతి , రేగోడు బిఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సుభాష్, మాజీ కోఆప్షన్ సభ్యులు మొయిజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.




