18-08-2025 03:31:13 PM
హైదరాబాద్: కూకట్పల్లి(Kukatpally) పరిధి సంగీత్ పగర్ లో సోమవారం పదేళ్ల బాలిక హత్య కలకలం రేపింది. ప్రైవేటు ఉద్యోగులైనా తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ఓ దుండగుడు హత్య చేశాడు. తండ్రి మధ్యాహ్నం ఇంటికి వచ్చి కుమార్తెను గుర్తించగా... ఇంట్లో బెడ్ పై గాయలతో కుమార్తె చనిపోయి కనిపించింది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు.