6 July, 2026 | 1:52 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

విద్యుదాఘాతంతో ఎద్దు సజీవదహనం

07-08-2025 12:03 AM

నారాయణఖేడ్, ఆగస్టు 6:  నారాయ ణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూరు మండలం రాయిపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతంతో ఎద్దు సజీవంగా దహనమైన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడి ఉస్మాన్ సాబ్ తన పొలం దున్నుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న వైర్లు తగలడంతో రెండు ఎడ్లు ప్రమాదానికి గురికాగా ఒకటి పారిపోగా మరో ఎద్దు విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగి సజీవంగా దహనమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

కండ్లముందే ఎద్దు సజీవంగా దహనం అవుతుండటంతో రైతు బాధ వర్ణనాతితంగా మారింది. స్థానిక రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించి విద్యుత్తు తొలగించి ట్రాన్స్ఫార్మర్ మంటలను అదుపు చేశారు. కాగా రూ. 80 వేల మేరా రైతు నష్టపోయాడని స్థానికులు పేర్కొన్నారు.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుందని, గతంలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపించారు. ప్రమాదానికి గురైన ఎద్దు యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్‌చేశారు.