24-05-2025 04:42:23 PM
మంథని (విజయక్రాంతి): మండలంలోని గద్దెలపల్లి గ్రామం(Gaddalapalli Village)లో శనివారం ఉదయం విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు ఇండ్ల సది ఎద్దు మేత కోసం వెళ్లగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపడడంతో పాటు సబ్ స్టేషన్ సమీపంలో ఉండడంతో ఎద్దు మేతకు పోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిందని రైతు స్వామి రోధిస్తూ తెలిపారు. తన ఎద్దు విలువ దాదాపు రూ.60,000 వేలు ఉంటుందని వాపోయాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ తూంబురపు తిరుపతి అధికారులను కోరారు.