23-11-2025 08:24:16 PM
నిర్మల్ రూరల్: సోను మండలంలోని కర్తాల్ గ్రామంలో శనివారం రాత్రి తాళం వేసిన మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. మోహన్ నరసవ్వ ఇండ్లకు తాళం వేసి వేరే గ్రామానికి వెళ్ళగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న నగదు వెండి బంగారం వస్తువులను వస్తువులను దొంగిలించినట్టు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోను పోలీసులు సంఘటన స్థానానికి వచ్చి క్లూస్ టీం ఆధారంగా నేరస్తులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్సై తెలిపారు.