calender_icon.png 9 July, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం ధ్వంసం అయిన కార్లు

09-07-2025 12:00:00 AM

నిజామాబాద్ జులై 8 (విజయక్రాంతి) : ఇందల్వాయి 44 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇం దల్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రాయన్ పల్లి వద్ద ఓ లారీ మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలు వురికి తీవ్రగాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి వద్ద మంగళవారం సాయంత్రం నిమాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక వైపు ముందు వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. అంతేకాకుండా.. కార్లను ఢీకొని లారీ ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చిన మరో లారీ దానిని ఢీకొట్టింది. ఒకదాని నేనొకటి ఢీకొనడంతో తీవ్ర నష్టం జరిగింది.

ఈ సంఘటనతో అటుగా బైక్‌పై వెళ్తున్న వారు ప్రమాద బారిన పడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో కారు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఇందులో ఉన్న కామారెడ్డికి వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులో హైదరాబాద్ వెళ్లే కారు పూర్తిగా ధ్వంసం కాగా.. అందులో ఉన్న వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. 

అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు దంపతులకు గాయాలవడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వీరు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామానికి చెందిన వారిని సమాచారం. భారీ ప్రమాదం జరగడంతో జాతీయ రహదారి పై  భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.