17 June, 2026 | 8:46 PM

Breaking News

కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •  

వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమంపై కేసులను ఆన్ లైన్ చేయాలి

06-09-2025 11:12 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమంపై చేసే కేసులను ఆన్ లైన్ పోర్టల్ ద్వారా దాఖలు చేయవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ - 2007, రాష్ట్ర నియమావళి 2011 ప్రకారం ఇకపై వయోవృద్ధుల సంరక్షణ సంక్షేమం కోసం దాఖలు చేసే కేసులు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్ (టీఎస్సీఎంఎంఎస్) ఆన్లైన్ పోర్టల్ ద్వారా/మీసేవ కేంద్రాల ద్వారా దాఖలు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఆఫ్ లైన్ లో కేసులు దాఖలు చేసే విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని, ఈ నేపథ్యంలో టి.ఎస్.సి.ఎం.ఎం.ఎస్. పోర్టల్ వినియోగం గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. సీనియర్ సిటిజెన్లు తమ హక్కులను రక్షించుకోవడానికి, సమస్యల పరిష్కారం కోసం పోర్టల్ వేదికను వినియోగించుకోవాలని కోరారు.