2 July, 2026 | 4:57 PM

Breaking News

ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •  

కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం: మాజీ ఎంపీ సోయం

01-05-2025 06:22 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టి సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక, కుల సర్వే నిర్వహించడం జరిగిందని ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. కులగణన ఆధారంగా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లతో పాటు వారి హక్కులను కాపాడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య ఉద్యమంలో  కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ విజయంగా భావిస్తున్నామని సోయం బాపూరావు పేర్కొన్నారు.