01-05-2025 08:46:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని మైనార్టీ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే ఉచిత కోచింగ్ కోసం అరులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025 26 విద్య సంవత్సరం కాను 100 మందికి ఉచిత శిక్షణ ఎంపిక ఉంటుందని తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే డిగ్రీ ఉన్నత విద్యార్థులకు వచ్చేసరికి ఉంటుందని అభ్యర్థులు వచ్చే నెల ఆరో తేదీ నాటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని సదివించుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు సంక్షేమ శాఖ కార్యాలయాలు సంప్రదించాలని సూచించారు. ముస్లింలు సిక్కులు, బౌదులు క్రైస్తవులకు ఈ అవకాశం ఉంటుందని వివరించారు.