2 July, 2026 | 3:58 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

తాపీ మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో మేడే

01-05-2025 06:24 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో తాపీ మేస్త్రి సంఘం భవనంలో మే డే ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.ఆర్ ఉపాలి మాట్లాడుతూ... కార్మిక వర్గం ప్రజలకు స్వేచ్ఛ కావాలంటూ బానిసతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సందర్భంగా కార్మిక వర్గాల చెమట రక్తంతోనే ఎర్రజెండా ఎగరేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. వెట్టి చాకిరి విముక్తికోసం పోరాటాలు చేసిన సందర్భాలను గుర్తు చేసి మేడే జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక ఎంఎల్ఎస్ పాయింటు గోదాము నుంచి ఎన్టీఆర్ చౌకు, బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఎగురవేసి మేడే జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు కడకుంట్ల రవి, చిలుకూరి, ఇస్తారు కోమటిపల్లి భీమయ్య, నర్సింలు, మద్దెల రాజలింగం, సురపాక రాజన్న, మాదాసు నరసయ్య, చంద్రయ్య, సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిట్టల భీమేష్, పిల్లి రమేష్, చిన్న భీమేష్ తదితరులు ఉన్నారు.