01-05-2025 08:55:32 PM
ఎంఈఓ ప్రతాప్ రెడ్డి...
పాపన్నపేట: ఈనెల 2వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి ప్రతాపరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... ఆరో తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే బాల బాలికలలు ఈ క్యాంపుకు అర్హులన్నారు. ఈ క్యాంపులో డ్రాయింగ్, క్రాఫ్ట్, కరాటే, కుట్లు, అల్లకం, డ్యాన్స్, వివిధ రకాల ఆట పాటలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనునట్లు ఆయన వెల్లడించారు. 15 రోజులపాటు కొనసాగే ఈ క్యాంప్ పాపన్నపేట ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. ఈ క్యాంపుకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ తో పాటు మంచినీటి సౌకర్యం కల్పించనునట్లు ఆయన వివరించారు. మిగతా వివరాలకు 8500200859 నెంబర్ ను సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు. వీటిని నేర్పడానికి అర్హత గల ఇన్స్పెక్టర్కు తమను సంప్రదించాలని వీరికి ఒకరికి రూపాయలు 3000 చొప్పున చెల్లించడం జరుగుతుందని ఆయన వివరించారు.