05-08-2025 01:05:10 AM
ఎల్బీనగర్, ఆగస్టు 4 : నాగోల్ డివిజన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీ రోడ్డు నెంబర్ 5లో రూ, 15 లక్షలు, సాయి సుప్రభాత్ కాలనీలో రూ ,18 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి రోడ్డు పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇంద్రప్రస్థ కాలనీ జనరల్ సెక్రెటరీ హరిబాబు, కాలనీ కమిటీ సభ్యులు వరకుమర్, లింగస్వామి, కృష్ణారెడ్డి, ప్రేమ్ బాబు, ముణేందర్, బీజేవైఎం నాయకులు తరల్ తదితరులు పాల్గొన్నారు.