22-01-2026 05:19:25 PM
- ఏ ఐ ఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
ముకరంపుర, జనవరి 22 (విజయ క్రాంతి): అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి ఉత్సవలను జయప్రదం చేయాలనీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంచిర్యాల చౌరస్తా నుండి నేతాజీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని, ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపారులు ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.