24-06-2025 08:50:20 PM
మునుగోడు (విజయక్రాంతి): కొంపెల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా పథకం ద్వారా విజయవంతంగా రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసిన సందర్భంగా రైతు భరోసా విజయోత్సవ కార్యక్రమాన్ని మునుగోడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన చేసిన విజయోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆనందోత్సవాన్ని రైతులతో ముఖాముఖిగా మాట్లాడడం రైతులందరూ రైతువేదికల ద్వారా వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పద్మజ, వ్యవసాయ విస్తరణ అధికారులు యాదగిరి ,వహీద్ ,కొంపెల్లి మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రైతులు మక్కెన కోటేశ్వరరావు, ఆళ్ల రాజు, జాల వెంకటేష్ , యాదయ్య, నాంపల్లి కృష్ణ, వీరమల్ల అశోక్ ,యాదయ్య ,వెంకట్ రాములు ,లాలయ్య, రామలింగం, మధుసూదన్ రెడ్డి రమేష్, మల్లారెడ్డి లోకయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు రైతులు ఉన్నారు.