24-06-2025 02:12:05 PM
మంథని(విజయక్రాంతి): మంథని పురపాలక సంఘం నూతన కమిషనర్ గా సీహెచ్ వెంకన్న నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ టికె. శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా వెంకన్న మంథని మున్సిపల్ గ్రేడ్-3 కమిషనర్ గా నియామకమయ్యా రు. ఆయనను రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.