17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

యువ జర్నలిస్ట్ హఠాన్మరణం అత్యంత బాధాకరం

24-06-2025 02:18 PM

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): యువ జర్నలిస్ట్ దత్తు రెడ్డి  హఠాన్మరణం అత్యంత బాధాకరమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా గత పది సంవత్సరాలు పని చేసిన సమయంలో చాలా సందర్భాల్లో ఆయనతో చర్చించడం జరిగిందని, దత్తు రెడ్డి జర్నలిస్ట్ గా చాలా అద్భుతమైన వార్తలను రాసారని ఆయన గుర్తు చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న దత్తు రెడ్డి, చిన్న వయస్సులోనే గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని పేర్కొన్నారు. దత్తు రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించి,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని గుత్తా తెలియజేశారు.