24-06-2025 02:18:20 PM
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): యువ జర్నలిస్ట్ దత్తు రెడ్డి హఠాన్మరణం అత్యంత బాధాకరమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా గత పది సంవత్సరాలు పని చేసిన సమయంలో చాలా సందర్భాల్లో ఆయనతో చర్చించడం జరిగిందని, దత్తు రెడ్డి జర్నలిస్ట్ గా చాలా అద్భుతమైన వార్తలను రాసారని ఆయన గుర్తు చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న దత్తు రెడ్డి, చిన్న వయస్సులోనే గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని పేర్కొన్నారు. దత్తు రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించి,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని గుత్తా తెలియజేశారు.