కాంగ్రెస్‌లోకి కామారెడ్డి గ్రంథాలయ చైర్మన్

27-04-2024 02:49:32 AM

కామారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ముదిరాజ్ మహా సభ ఉపాధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్, పాత శివకృష్ణమూర్తి, రవీందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గూటికి తాడ్వాయి ఎంపీపీ

కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఎంపీపీ కౌడి రవి శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో నాయకులు లింగా గౌడ్, చింతల లక్ష్మి, సంజీవ్ పాల్గొన్నారు.