l జిల్లా కేంద్రంలోని నందిహిల్స్లో కాంగ్రెస్లో చేరిన నేతలు
l బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి 50 మంది
l ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో చేరికల పర్వం
వనపర్తి , ఏప్రిల్ 26, (విజయక్రాంతి): లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ ఆయా పార్టీల్లో చేరికల పర్వం నడుస్తోంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని నందిహిల్స్లో మండల పరిధిలోని తాడిపర్తి గ్రామ 50 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోపాల్ పేట మండల బ్లాక్ అధ్యక్షులు పర్వతాలు, జడ్పీటీసీ మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సత్య శీలారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా ప్రతినిథులకు ఎలాంటి గౌరవం లేదు, కేవలం దిష్టిబొమ్మాలా మాత్రమే ఉంచారు’ అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నేతలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.