calender_icon.png 22 June, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ

22-06-2025 12:14:31 AM

 12 ఏళ్లకే అండర్-

12 ఏండ్ల వయస్సులోనే  బీహార్ అండర్- జట్టు తరపున వినూ మాన్కడ్ ట్రోపీలో ఆడాడు. 2023లో ఇండియా-బి అండర్-19 జట్టు నాలు గు దేశాలతో సిరీస్ ఆడింది.  ఆ సిరీస్ల్లో ఆరు ఇన్నింగ్స్లు కలిపి 89 బంతు లు ఆడి రెండు హాఫ్ సెంచరీలతో 195 పరుగులు చేశాడు. 2024 సెప్టెంబర్లో ఆస్ట్రేలి యా అండర్-19 జట్టుతో ఆడిన సూర్యవంశీ 58 బంతుల్లో సెంచరీ సాధించి.. అత్యంత వేగవంతమైన సెంచరీ  సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2024లో అం డర్-19 ఆసియా కప్లో యూఏఈతో మ్యాచ్లో 46 బం తుల్లో 76 పరుగులు చేశాడు. అదే టోర్నీలో లంకతో జరిగిన సెమీస్లో 36 బం తుల్లోనే 67 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

సాధారణంగా 14 ఏళ్ల కుర్రాడు మహా అయితే ఏం చేస్తాడు?.. అందరి లాగా పాఠశాలకు వెళ్తూ చదువుకుంటాడు లేదా స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాడు మాత్రం బంతులతో ఆడుకుంటున్నాడు. నూనుగు మీసాల వయసులోనే బౌలర్లను చీల్చి చెండాడుతూ ఎడా పెడా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.  12 ఏళ్లకే క్రికెట్లో అడుగుపెట్టిన ఈ చిచ్చరపిడుగును ఐపీఎల్లో రాజస్థాన్ రాయ ల్స్ రూ. 1.1 కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పుడు.. పెద్దగా ఏం ఆడుతాడులే అనుకు న్నారు అంతా..  కానీ 2025 ఐపీఎల్ సీజన్లో మాత్రం ఊహకందని రీతిలో చెలరేగి నిజమైన చిచ్చరపిడుగు అనిపించుకున్నాడు.. వైభవ్ సూర్యవంశీ.

ఎవరీ సూర్యవంశీ?

బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్పూర్ గ్రామానికి చెందిన వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 27న జన్మించాడు. తన 13-ఏటనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రంగ ప్రవేశం చేసిన వైభవ్.. దేశవాలీ క్రికెట్లో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడ. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో రంగ ప్రవేశం చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడా డు. ఎడమ చేతి బ్యాటర్గా మేటి బౌలర్లు వేసే బంతులను అవలీలగా బౌండరీలు దాటిస్తూ సత్తా చాటుతున్నాడు. నాలుగేండ్లకే బ్యాట్ పట్టిన సూర్యవంశీ తొమ్మిదేళ్లకే సమస్తీపూర్ క్రికెట్ అకాడమీలో చేరి, తండ్రి శిక్షణలో ఓనమాలా నేర్చుకోవడం ప్రారంభించాడు. తద నంతరం ఇం డోర్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. 

ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సుర్యవంశీ అరంగేట్రం

2024 జనవరిలో 12 ఏండ్ల 284 రోజుల వయస్సులో బీహార్ తరపున రంజీ జట్టుకు ఎంపికై ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. 2024 నవంబర్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టాడు.  2024 - 25లో విజయ్ హజారే ట్రోఫీలో బీహారు తరఫున ఆడాడు. 

ఐపీఎల్లో అద్భుత ఆటతీరు..

14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 13 ఏళ్ల వయసు లోనే అతడు వేలంలోకి వచ్చాడు. అయితే డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో లాంటి ప్లేయ ర్లే అన్సోల్డ్గా మిగిలిన ఈ వేలంలో సూర్యవంశీకి భారీ డిమాండ్ దక్కింది. అతడి కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు సొం తం చేసుకుంది.

లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఔటైన తర్వాత కన్నీరు పెట్టుకుంటూ పెవిలియన్ దారి పట్ట డం అందరిని కలచివేసింది. అయితే ఏప్రిల్  28, 2025న గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ తొలిసారి తన ఆటను చూపెట్టాడు. అంతర్జాతీ య స్థాయి బౌలర్లను అవలీలగా ఎదుర్కొన్న వైభవ్  38 బం తుల్లోనే 101 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు.  అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా, అంతర్జాతీయ స్థాయి లో రెండవ బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్లో 7 మ్యాచ్లాడి 252 పరుగులు చేశాడు. 

ఐపిఎల్ తొలి బంతికే సిక్సర్ కొట్టాడు మన కౌమార వైభవ్. పంజాబ్తో మ్యాచ్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టి 40 పరుగులు చేశాడు. జూన్ 2025 లో ఇంగ్లండ్‌లో జరిగే 50 ఓవర్ల అండర్-19 జట్టుకు ఎంపికైన వైభవ్  సోషల్ మీడియా సెన్సేషన్ అ యిపోయాడు. తన దూకుడైన ఆటతీరుతో క్రీడాభిమానుల మన్ననలు చూరగొన్నాడు. కౌమా ర దశలోనే అద్భుత ఆటతీరు, వినయం, ఆట పట్ల అంకిత భావం ప్రదర్శిస్తున్న వైభవ్ సూర్యవంశీ రాబోయే రోజుల్లో మరో సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, విరా ట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంత పేరు తెచ్చుకొని దేశ క్రికెట్ ప్రతిష్టను ఇనుమడింపజేయాలి. వైభవ్ సూర్యవంశీ క్రికెట్ జీవితం దివ్యంగా.. వైభవంగా కొనసాగాలని కోరుకుందాం.

 డా. బుర్రా మధుసూదన్ రెడ్డి 9949700037