calender_icon.png 22 June, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

22-06-2025 12:19:49 AM

నీరజ్‌దే ‘పారిస్ డైమండ్’

భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మళ్లీ మెరిశాడు. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు అందించిన నీరజ్ పారిస్ డైమండ్ లీగ్‌లో విజేతగా అవతరించి చరిత్ర సృష్టించాడు. తన లక్ష్యం 90 మీటర్ల మార్క్‌ను అందుకోవడంలో విఫలమైనప్పటికీ జావెలిన్‌ను 88.16 మీటర్ల దూరం విసిరి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. నీరజ్ చోప్రాకు గత రెండేళ్లలో ఇదే తొలి డైమండ్ లీగ్ టైటిల్ కావడం విశేషం. 

రికార్డుల రారాజు శుభాంశు

రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి అడుగుపెట్టనున్న భారతీయుడిగా 39 ఏండ్ల శుభాంశు శుక్లా రికార్డు నెల కొల్పాడు. లక్నోలో పుట్టిన శుక్లా భారతీయ వైమానిక దళంలో కొలుపు సంపాదించాడు. 2వేల గంటల పాటు వి మానం నడిపిన అనుభవం ఉన్న శుక్లా 2019 నుంచి ఆస్ట్రోనాట్ సెలక్షన్ ప్రాసె స్‌లో ఉన్నారు. ట్రైనింగ్‌లో భాగంగా ర ష్యాకు కూడా వెళ్లిన శుక్లా ఇస్రో, నాసా, స్పేస్ ఎక్స్‌లు కలిసి సంయుక్తంగా నిర్వహించబోతున్న యాక్సియం మిషన్ ద్వారా రోదసిలోకి దూసుకుపోనున్నాడు.