9 April, 2026 | 10:27 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

“రన్ ఫర్ యూనిటీ”లో పాల్గొన్న చిరంజీవి

31-10-2025 01:36 PM

హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని పలు చోట్ల 'రన్ ఫర్ యూనిటీ'(Run for Unity) నిర్వహించారు. డీజీపీ శివధర్ రెడ్డి, చిరంజీవి, సీపీ సజ్జనార్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో(People's Plaza) ఐక్యత రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వరకు రన్ కొనసాగింది. కూకట్ పల్లిలో ఐక్యత రన్ ను ఏసీపీ రవి కిరణ్ రెడ్డి ప్రారంభించారు. జేఎన్ టీయూ నుంచి నెక్సస్ మాల్ వరకు రన్ కొనసాగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్(Secunderabad Parade Ground) నుంచి జేబీఎస్ వరకు కొనసాగిన ఐక్యత రన్ పెద్ద సంఖ్యలో యువత, పోలీసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాట్లాడుతూ... డీప్ ఫేక్ అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. డీప్ ఫేక్ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని చిరంజీవి తెలిపారు. డీజీపీ, సీపీ సజ్జనార్ డీప్ ఫేక్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని చిరంజీవి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని తెలిపారు. డీప్ ఫేక్ నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక చట్టాలు లేకపోతే డీప్ ఫేక్ వల్ల భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వస్తాయన్నారు.