23 June, 2026 | 1:32 AM

ట్రంపు అవెన్యూ నిర్ణయాన్ని రద్దు చేయాలి

23-06-2026 12:00 AM

నల్ల జెండాలతో సీఐటీయూ నిరసన

మహబూబాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ట్రంపు ఆవెన్యూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీ ఐ టీ యూ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో మహబూబాబాద్ వివేకానంద సెంటర్లో నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు మాట్లాడుతూ హైదరాబాద్ లోని అమెరికన్ కన్సోలేట్ వద్ద ఒక ప్రధాన రహదారికి డోనాల్ ట్రంప్ ఆవెన్యూగా నామకరణం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహం చేశారు. ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి అమెరికా సామ్రాజ్య వాదము ప్రజల మీద యుద్ధాలను చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల రక్త మాంసాలను పీల్చి  పిప్పి చేసిందని  విమర్శించారు.

మన దేశం మీద ట్రంప్ ఆంక్షలు విధించడంతో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మోడీ సహకారం తొడవడంతో దేశం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని వేడల ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ  నాయకులు సమ్మెట రాజమౌళి, దుండి వీరన్న. తాడబోయిన శ్రీశైలం, గుండు సులోచన, పగిడి పాల తిరుపతక్క, కోటేశ్వరరావు, తోట శ్రీనివాస్, పాల బిందెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.