9 May, 2026 | 10:30 AM

Breaking News

నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •  

పులిమామిడి గ్రామంలో సివిల్ రైట్స్ డే

01-07-2025 12:59 AM

చేగుంట, జూన్ 30 : చేగుంట మండల పరిధిలోని  పులిమామిడి గ్రామంలో సోమవారం చేగుంట ఎస్త్స్ర-2 బిక్య నాయక్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే ( పౌర హక్కుల దినోత్సవం ) కార్యక్రమన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ, ఎస్టి, బీసీ, ఇతర కులాల మధ్య తేడాలు, విబేధాలు రాకూడదన్నారు.

చాయి హోటళ్లలో ఓకే గ్లాస్ విధానం ఉండాలని, గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలో దైవదర్శనానికి వచ్చే ఎస్సీ, ఎస్టీకి చెందిన కులస్తులను అడ్డుకోకూడదన్నారు. ఎవరైనా కులం పేరుతో దూషించినా, దేవుని గుడిలోనికి రాకుండా అడ్డుపడినా వారి పైన ఎస్సీ, ఎస్టీ అట్రాస్టీట్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ 2 బిక్య నాయక్, ఆర్‌ఐ సంతోష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రమేష్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామస్తులు పాల్గొన్నారు.