17 April, 2026 | 10:15 AM

పౌరసరఫరాల శాఖకు ఐఎస్‌ఓ గుర్తింపు

01-05-2025 12:46 AM

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ర్ట పౌరసరఫరాల సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సన్నబియ్యం పంపిణీ, సంస్థలో పలు మెరుగైన సేవలకుగాను ఐఎస్‌ఓ సర్టిఫికెట్ దక్కింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చౌహాన్ ఫైవ్ స్టార్ రేటింగ్ తో కూడిన 9001 సర్టిఫికెట్‌ను అందుకున్నారు.