15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సీఎం కప్ మండల క్రీడా పోటీలు ప్రారంభం

29-01-2026 03:39 PM

జైనుర్ జనవరి 29 (విజయ క్రాంతి): జైనూర్ మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కే.విశ్వనాథ్ ప్రారంభించగా,సీఐ రమేష్,తహసీల్దార్ అడా బిర్సావ్,స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు.గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో ప్రతిభను వెలికితీసుకుని రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.పోటీలను క్రమబద్ధంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.క్రీడల ద్వారా స్నేహభావం,క్రమశిక్షణ పెరుగుతుందని అన్నారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.క్రీడాకారులకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు,అధికారులు,యువకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.