14 April, 2026 | 5:16 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

విధుశేఖర భారతీ తీర్థస్వామిని కలిసిన సీఎం

29-10-2025 01:10 AM

శంకర్‌మఠ్‌లో మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని నల్లకుంట శంకర్‌మఠ్‌లో శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ తీర్థస్వామి వారిని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ధర్మ విజయ యాత్ర’లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విధుశేఖర భారతీ తీర్థస్వామి శంకర మఠానికి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్కడకు వెళ్లి స్వామిజీ దివ్య ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారికి సమగ్రంగా వివరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి శంకర్‌మఠంలోని గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు.