విద్యార్థిని అభినందించిన సీఎం రేవంత్రెడ్డి
రాజేంద్రనగర్, ఏప్రిల్ 26 : కష్టపడి చదువుకునే విద్యార్థులకు ప్రభు త్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ రాధానగర్కు చెందిన సోమి శెట్టి రవికాంత్ కుమార్తె మనోజ్ఞ ఇంటర్మీడియేట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు 993 సాధించి ఔరా అనిపించింది. విషయం తెలుసుకున్న సీఎం విద్యార్థిని పిలిపించుకొని అభినందించి శాలువాతో సత్కరించారు.