calender_icon.png 18 June, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సిబ్బంది శ్రమను కళ్లారా చూశా

18-06-2025 12:45:48 PM

  1. కాంగ్రెస్ అంటేనే కరెంట్
  2. విద్యుత్ సిబ్బంది సమస్యలపై నిత్యం శ్రమిస్తా

హైదరాబాద్: ఖమ్మం జిల్లాల్లో(Khammam Districts) వరదలు వచ్చినప్పుడు విద్యుత్ సిబ్బంది వేగంగా పనిచేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarkaప్రశంసిస్తారు. ఎలక్ట్రిక్ అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... విద్యుత్ పునరుద్ధరణకు ప్రాణాలు తెగించి సిబ్బంది పనిచేశారని చెప్పారు. వరదల్లోనే వెళ్లి స్తంభాలు ఎక్కి విద్యుత్ ను పునరుద్ధరించారని చెప్పారు. విద్యుత్ సిబ్బంది శ్రమను కళ్లారా చూశాను, విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తానని విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. కోటి బీమా చేయించామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదని కొందరు అజ్ఞానంతో మాట్లాడుతారు.. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అన్నారు. ముందుచూపుతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగలిగేది కాంగ్రెస్సే అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం పరిశ్రమ పెట్టలేదు.. రూ. లక్ష కోట్లతో పంప్డ్ స్టోరేజీ, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఉచితంగా విద్యుత్ కోసం విద్యుత్ శాఖకు రూ. 13,992 కోట్లు చెల్లించామని ఆయన వివరించారు.