01-12-2025 02:24:12 PM
హైదరాబాద్: వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. అందుకే సీఎం ఆత్మకూరు బయలుదేరారు. అలాగే మక్తల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మక్తల్ పట్టణానికి వెళ్లి పడమటి ఆంజనేయస్వామివాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజాలు చేయనున్నారు. అక్కడి నుంచి అంబేద్కర్ నగరలోని బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రులు రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు.