calender_icon.png 22 July, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

21-07-2025 07:31:45 PM

హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు.

రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ప్రతిపాదిత పాలసీపై ఉన్నతస్థాయి సమావేశంలో పాలసీ గురించి అధికారులు వివరించినప్పుడు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వ ప్రాతినిథ్యం వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.