16 April, 2026 | 10:48 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

జలసౌధకు సీఎం రేవంత్ రెడ్డి

14-05-2025 09:41 AM

కొత్తగా నియమితులైన ఏఈలు, జేటీవోలకు నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం సాయంత్రం జలసౌధకు వెళ్లనున్నారు. కొత్తగా నియమితులైన ఏఈ, జేటీవోలకు రేవంత్ రెడ్డి నియామకపత్రాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం నీటిపారుదల అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(Telangana Core Urban Region) పై కూడా సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు, అంతరాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.