14-05-2025 11:11:18 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లి(Secunderabad Bowenpally)లోని డెంటింగ్ గ్యారేజీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్ బస్సుకు డెంటింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. స్కూల్ బస్సు నుంచి ఇతర వాహనాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజీ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.