16 April, 2026 | 10:48 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు.. తండ్రి కుమార్తె మృతి

14-05-2025 09:30 AM

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం(Veldanda Mandal) జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి అదుపు తప్పిన కారు ఆగి ఉన్న డీ సీఎం వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ప్రమాదంలో కుమార్తె తేజశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులను నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) తెలకపల్లి మండం నెల్లికుదురు వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు.