calender_icon.png 12 November, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

12-11-2025 02:41:00 PM

హైదరాబాద్: అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో హాజరయేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇలరాత్రి 8 గంటలకు ఢిల్లీ బయల్దేరనున్న సీఎం రేపు ఉదయం 9 గంటలకు సదస్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9వ తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నట్లు సమాచారం.