15 March, 2026 | 5:59 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

సీఎం.. సమోసా.. ఓ వివాదం

09-11-2024 01:18 AM

హిమాచల్‌లో సమోసాపై రాజకీయ చర్చ

న్యూఢిల్లీ, నవంబర్ 8: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో సమోసా పేరు మార్మోగుతోంది. ఈ వివాదంపై స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఈ వివాదమేంటంటే గతనెల 21న సీఎం సుఖ్విందర్ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ఓ పేరున్న హోటల్ నుంచి సమోసాలు తెప్పించగా, వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తిన్నారని వార్తలు వచ్చాయి.

సీఎం వద్దకు చేరాల్సిన సమోసాలు ఎలా మిస్సయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాంతో ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరని సీఐడీ తేల్చనుందని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సమోసాల వ్యవహారం దుమారం రేపడంతో సీఎం సుఖు స్పందించారు. సీఐడీ విచారణ జరుపుతున్న అంశం వేరని, కానీ ప్రతిపక్షాలు సమోసాపై ప్రచా రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.