05-06-2025 12:52:15 AM
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూన్ 4: శేరిలింగంపల్లి హఫీజ్పెట్ డివిజన్ పరిధి లో గల లికియా బేగం వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.32, 000/- ముప్పు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబం ధించిన చెక్కును తన నివాసంలో బాధిత కుటుంబానికి అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరంఅని ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పునరుద్గాటించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి ,కరుణాకర్ గౌడ్ మరియు తదితరులుపాల్గొన్నారు