calender_icon.png 20 June, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరటి రైతులకు ప్రోత్సాహకాలు

05-06-2025 12:53:25 AM

జగిత్యాల అర్బన్, జూన్ 4 (విజయక్రాంతి): జిల్లాలో అరటి సాగును పెంచేందుకు రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అరటి రైతులకు, వ్యాపారస్థులకు సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రేడర్స్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తే ఎన్ని టన్నులైన కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహారాష్ట్ర లోని జల్గామ్ గ్రామంలో నాణ్యమైన అరటి పండిస్తున్నారని, విదేశాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు. అరటి రైతులు మాట్లాడుతూ మార్కెట్ కి అనుగుణమైన రకం పండించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, జల్గామ్ లోని అరటి  రైతుల క్షేత్ర సందర్శన చేపట్టాలని కోరారు.

జిల్లా ఉద్యాన అధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొత్త రైతులను అరటి పండించడానికి గుర్తిస్తామని, సాగు చేసే రైతులకు నాణ్యమైన ఉత్పత్తిని సాధించుడానికి ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా ఎకరానికి 16800/- సబ్సిడీ అందిస్తామని తెలిపారు.

కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతు కొంతమంది అరటి రైతులకు మహారాష్ట్ర లోని జల్గామ్ లో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, జిల్లాలో 1500-2000 ఎకరాలలో అరటి సాగును పెంచాలని, ప్రభుత్వం ద్వారా రైతులకు సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉద్యాన అధికారులు, ఢిల్లీ, మహారాష్ట్ర, జగిత్యాల కు చెందిన అరటి ట్రేడర్స్, రైతులుపాల్గొన్నారు.