05-06-2025 12:50:14 AM
రాజేంద్రనగర్, జూన్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగుబలహీన వర్గాల ప్రజల సొంతింటి కలను నిజం చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసి 85మంది లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అన్నారు. న్నివర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వడం చరిత్రాత్మకమని కొనియాడారు.
సీఎం రేవంత్ రెడ్డికి పేదల కష్టాలు తెలుసని అన్నారు. వారిని లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు. లబ్ధిదారులందరూ ఇందిరమ్మ ఇళ్లను కట్టుకోవాలని సూచించారు. అందరూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని పాల్గొన్నారు.