calender_icon.png 22 November, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తల్లితో సహజీవనం.. కుతుళ్లపై లైంగికదాడి

10-02-2025 12:00:00 AM

  1. నీచానికి ఒడిగట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
  2. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

సూర్యాపేట, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఓ మహిళతో సహజీవనం చేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కూతుళ్లపై లైంగికదాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సునీల్ భార్య కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందింది.

2018 నుంచి ఓ మహిళతో సహజీవనం చేస్తూ వస్తున్నాడు. సహజీవనం చేస్తున్న మహిళకు ఇద్దరు కుమార్తెలు(మైనర్లు) ఉన్నారు. వారిపై కన్నేసిన ఉపాధ్యాయుడు తల్లి లేని సమయం చూసి గత రెండేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో వారు భయపడి బయట  ఈ నేపథ్యంలోనే సునీల్ హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకున్నట్టు తెలిసి ఆ కూతుళ్లు లైంగిక దాడి గురించి తమ తల్లికి చెప్పినట్టు సమాచారం. కూతుళ్లతో కలిసి బాధితురాలు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వీర రాఘవులు తెలిపారు.