11-06-2025 12:39:28 AM
కరీంనగర్, జూన్ 10 (విజయ క్రాంతి): తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
మంగళవారం యశ్వంత్ జిల్లా కలెక్టర్ ను కలిసి తాను అధిరోహించిన మిజోరం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎత్తున శిఖరాల ఫోటోలను కలెక్టర్ కు అందించారు. ఈ సందర్భంగా యశ్వంత్ ను కలెక్టర్ అభినందించారు. భవిష్యత్తులో మరింత ఎత్తున శిఖరాలను అధిరోహించాలనిఆకాంక్షించారు.