calender_icon.png 15 June, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి పన్ను కట్టాల్సిందే..

11-06-2025 12:40:21 AM

- చెత్త తీసుకెళ్తే.. డబ్బులివ్వాలసిందే..

- కోట్లల్లో అభివృద్ధి అంటున్నారు... చెత్త తీసుకెళ్లేందుకు ఆటోలు లేవంటున్నారు

- ఇదీ ఖమ్మం కార్పొరేషన్ పరిస్థితి

ఖమ్మం , జూన్ 10 (విజయ క్రాంతి) :ఇంటి పన్ను కట్టామంటే ...సంబంధిక పంచాయితీ కానీ మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ  వారే వీధి దీపాలు పెట్టిస్తారు.... రోడ్లు వేయిస్తారు ... ఇంట్లో చెత్తను వారే ఆటో ల ద్వారానో లేక మరె ఇ తరత్రా వాహనాల ద్వారా నో డంపింగ్ యార్డ్ కి తరలిస్తారు.

కానీ ఖమ్మం కార్పొరేషన్ లో ఈ ఆవకాశం కొన్ని ప్రాంతాలలోనే వుంది .. మిగతా ప్రాంతాల వారు నెలకు రూ. 100/- చె ల్లిస్తేనే వారింట్లో చేత్త ను  ఆటోల వారు తీసుకెళ్తారు. లేదంటే వారి ఇంట్లో చెత్త తీసుకెల్ల రు.వివరాల్లోకి వెళ్తే .... ఖమ్మం కా ర్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్ లు వున్నవి.కార్పొరేషన్ కు సంబంధించి 161 వాహనాలు వున్నవి, ఇందులో జెసిబి లు 3 కాగా మిగతావి ట్రాక్టర్‌లు ఆటోలు. వీటి ద్వారా చెత్తను తరలిస్తే ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి కాక ఖ మ్మం కార్పొరేషన్ పరిధిలో మరో 50 ప్రైవేట్ ఆటో లు వు న్నవి.

ఈ వాహనాలకు మున్సిపాలిటీ ఏమి చెల్లించదు.  కానీ ఖమ్మం టౌన్ లోని ఎక్కువ డివిజన్ లలో ని గృహాల నుంచి చెత్తను ఈ ప్రైవేట్ ఆటో ల ద్వారానే డంప్పింగ్ యార్డ్ కి తరలిస్తున్నారు. ఈ ప్రైవేట్ ఆటోల ద్వారా చేత్త ను సేకరించి డం పింగ్ యార్డ్ కి తరలించటంతో వీరికి ప్రతి గృహము నుంచి నెలకు రూ. 100/- చెల్లించాల్సి వస్తుంది.  ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణకు ఎటువంటి డబ్బులు ఇవ్వటము లేదుకదా మరి మేము ఎందుకు ఇవ్వాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కార్పొరేషన్ పరిధిలో రెండు రో జులకు ఒకసారి చెత్తను సేకరించాల్సి ఉండగా ఈ ప్రైవేట్ వా హనాల వారు డబ్బులు తీసుకొని కూడా వారానికి ఒకసారి వస్తున్నారు.నెలలో 3 నుంచి 4 సార్లు మాత్రమే వీరు చేత్త ను సేకరించి గృహస్థులు వద్దనుంచి నెలకు రూ. 100/- వసూ లు చేస్తున్నారు.వాస్తవానికి ఈ వాహనాలు కమర్షియల్ ప్రాం తాల్లో చెత్త సేకరించి వారి వద్ద నుండి మాత్రమే డబ్బులు వాసులు చేసుకోవాలి, కానీ వాహనాల కొరతతో కొన్ని డివిజన్ ల నుండి  ఈ వాహనాల ద్వారా గృహ సముదాయాల నుండి చెత్త సేకరిస్తున్నారు. ప్రతి ఏడాది మేము ఇంటి పన్ను కడుతున్నాము మల్లి ఈ చెత్త తీసుకెళ్లాటానికి నెలకు ఎందుకు రూ 100/-చొప్పున చెల్లించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నెల కు రూ. 100/- చొప్పున ఏడాదికి రూ. 1,200/- వరకు చెల్లించాల్సి వస్తుందని ఖమ్మం వాసులు తమ ఆవేదన వెళ్ళబు చుతున్నారు.మొత్తం ఈ 50 వాహనాల ద్వారా నెలకు గృహా ల నుండి లక్షల్లో డబ్బులు వాసులు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేస్తున్నామని ప్రక టించే ప్రజా ప్రతినిధులు కాలనీల్లో చెత్త సేకరణకు ప్రభుత్వ ఆటోలు పెట్టలేరా అని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఈ తంతు కొన్ని ఏళ్లుగా జరుగుతున్న ప్రజల నుండి ఈవిధంగా డబ్బు లు వసూలు చేస్తున్న, పట్టించు కొనే వారే లేరని ప్రజలు మం డి పడుతున్నారు.వీరిని అధికారులు ఎందుకు ప్రోత్సహస్తున్నారు.ఈ ఆటో లని ఎందుకు ప్రోత్సాహస్తున్నారు అని ప్రజ లు ప్రశ్నిస్తూ, వీరి వద్ద నుండి కొంత మొత్తం క్రింది స్థాయి సి బ్బందికి  ఏమైనా అందుతుందా అనే అనుమానాన్ని కొంద రు వ్యక్తం చేస్తున్నారు. వినటానికి నెలకు రూ. 100/- గానే ఉన్న పట్టణములోని వేలాది ఇళ్ల నుండి లక్షలాది రూపాయ లు వసూలు చేస్తున్నారని, ఉన్నతధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి డబ్బులు వసూలు చేయటాన్ని ఆపి, ప్రతి ఇంటి నుండి ఉచితంగా చెత్తను సేకరించాలని కోరుతున్నారు.

వాళ్ళు కమర్షియల్ ప్రాంతాల్లోనే డబ్బులు తీసుకోవాలి.. ఆ వాహనాలు మావి కావు

ఈ పద్ధతి గతం నుండి ఇక్కడ  వుంది. నేను గత 5 నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చాను.ఈ ప్రైవేట్ వాహనాలు కమర్షియల్ ప్రాంతాల్లో మాత్రమే చెత్త సేకరించి కొంత తీసుకువాలి, వారు ఇళ్ల నుండి డబ్బులు తీసుకోకూడదు.ఈ ప్రైవేట్ వాహనాలు ఏఏ  ప్రాంతాల్లో ని ఇళ్ల నుండి చెత్త సేకరించి డబ్బులు వాసులు చేస్తున్నారో మీ జవాన్ లకు తెలుసు కదా అని అడుగగా, వారి వద్ద సమాచారం తీసుకొని, అధికారులకు వివరిస్థానన్నారు.

 సాంబయ్య, ఖమ్మం కార్పొరేషన్ సానిటరీ సూపర్వైసర్