calender_icon.png 10 October, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదాములలో ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్

08-10-2025 01:07:14 AM

కామారెడ్డి, అక్టోబర్ 7 (విజయ క్రాంతి):  కామారెడ్డి మంగళవారం  జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలో గల ఎలక్షన్ గౌడౌన్ జిల్లా అదనపు  కలెక్టర్ రెవెన్యూ విక్టర్ తో కలిసి సందర్శించి ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్ద రక్షణ చర్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు ఇవిఏం గోడౌన్ సందర్శించి  రక్షణ చర్యలను పరిశీలించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఇవేం గోడౌన్లో సిసి కెమెరాలు 24 గంటలు పని చేసేలా చూడాలని, ఇసిఐ మార్గదర్శకాలు ప్రకారం నిరంతరం బందోబస్తు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. కామారెడ్డి తాసిల్దార్ జనార్ధన్, ఎలక్షన్ డిటి  పాల్గొన్నారు.