21-06-2025 07:32:54 PM
మేడ్చల్ (విజయక్రాంతి): కలెక్టర్ మను చౌదరి(Collector Manu Chaudhary) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి ఎస్ ఎన్. శ్రీదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. అల్వాల్ లోని లయోలా కాలేజీలో సెషన్ జడ్జిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మొదటి అదనపు జిల్లా జడ్జి బి. తిరుపతి, మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం. వెంకటేశ్వరరావును కూడా కలిశారు.