calender_icon.png 21 June, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనవని

21-06-2025 07:31:18 PM

నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనవని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Former MLA Kancharla Bhupal Reddy) తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేబీఆర్ క్యాంప్ కార్యాలయంలో నల్లగొండ నియోజకవర్గం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఈ అవకాశాన్ని స్థానిక నాయకత్వం అవకాశంగా చేసుకుని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో ఎన్నికైయ్యే విధంగా వ్యూహాలు రూపొందించుకోవాలని అన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయక, ప్రజలను మోసం చేయడాన్ని, వివరించి ప్రజలకు దగ్గరకావాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్,ఎంపీ మాజీ ఎంపీపీలు, ఎస్ కె కరీం పాషా  నారబోయిన బిక్షం, మాజీ జడ్పిటిసిలు తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి ధోటి శ్రీనివాస్, నాయకులు సింగం రామ్మోహన్, కొండూరు సత్యనారాయణ, లొడంగి గోవర్ధన్, మారగోని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, జమాల్ ఖాద్రి, సయ్యద్ జాఫర్, రంజిత్,వనపర్తి జ్యోతి, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, తవిటి కృష్ణ, కడారి కృష్ణయ్య, కృష్ణార్జున రెడ్డి, పలువురు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య కార్యకర్తలు పార్టీ కమిటీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.