2 July, 2026 | 4:20 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఈవీఎం గోదాంలను తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరీష్

07-08-2025 01:15 AM

వరంగల్, ఆగస్టు 6(విజయక్రాంతి): వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోదాంలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం తనిఖీ చేశారు.  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెలవారి సాధారణ తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ ఈవీఎం గోదాములను అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

ఈవీఎం గోదాంల వద్ద పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ అంశాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం గోదాంలకు వేసి ఉన్న సీల్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.