6 May, 2026 | 11:28 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఈ ఏడు వర్షాలు బాగా కురవాలని సూరయపల్లిలో గ్రామస్తుల కప్పతల్లి ఆట

07-08-2025 07:03 PM

మంథని (విజయక్రాంతి): ఈ ఏడు వర్షాలు బాగా కురవాలని మంథని మండలంలోని సూరాయపల్లి గ్రామంలో గురువారం గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కప్పతల్లి ఆట ఆడారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆకుల కిరణ్, మాజీ ఎంపిటిసి భీముని స్వామి, మాజీ వార్డు సభ్యులు ఆరెల్లి కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ కర్ణ కృష్ణలు మాట్లాడుతూ.. మంథని ప్రాంతంలో వర్షాల అధికంగా కురువకపోవడంతో మా ఊరి ఆనవాయితి ప్రకారం ఈ కప్పతల్లి ఆట ఆడడం జరిగిందని, సూరాయపల్లి హనుమాన్ దేవాలయంలో 108 బిందెల నీళ్లతో అభిషేకం, గ్రామదేవతలకు నీళ్లతో అభిషేకం చేశామన్నారు. వానదేవుడు కరుణించి వానలు కురవాలని పాడిపంటలు పండి, గ్రామల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కప్పతల్లి ఆట ఆడమన్నారు. అనంతరం ఆరెల్లి కిరణ్ గౌడ్  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కప్పతల్లి ఆటలు గ్రామ ప్రజలు, మహిళ సోదరిమణులు, రైతులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.